రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త!

0
Centre to roll back 3 farm laws

రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రైతుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ నెలాఖరులో చట్టాలను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలకు సంబంధించి జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ.. దేశ ప్రజలను క్షమాపణ కోరుతున్నట్లు తెలిపారు. మనస్ఫూర్తిగా వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

‘మూడు వ్యవసాయ సాగు చట్టాలు పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నాం. ఈ నెలాఖరులో మొదలయ్యే పార్లమెంట్‌ సమావేశాల్లో దీనిపై ప్రకటన చేసి, రాజ్యాంగ పరమైన ప్రక్రియ ప్రారంభిస్తాం. వ్యవసాయ బడ్జెట్‌ను 5 రేట్లు పెంచాం, తక్కువ ధరకే విత్తనాలు అందేలా కృషి చేస్తాం, ఫసల్‌ బీమా యోజనను మరింత బలోపేతం చేస్తాం. దేశ రాజదని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన విరమించాలి, మిమ్మల్ని నొప్పించి ఉంటే మీకు క్షమాపణలు తెలియజేస్తున్నాను’ అని మోదీ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here