కార్మికుల సంక్షేమం కోసం కేంద్రం కీలక నిర్ణయం

0

దేశ వ్యాప్తంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం కార్మిక, ఉపాధిశాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ నేడు లాంఛనంగా ఈ-శ్రమ్ అనే పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా దేశంలోని అసంఘటిత రంగం(కూలీలు, రీక్ష కార్మికులు, చిన్న వ్యాపారులు) కార్మికుల వివరాలను సేకరిస్తారు. దీని వల్ల ఆయా కేటగిరిల కింద ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కార్మికులకు సులభంగా అందించే వీలు కలుగుతుంది. అలాగే వారి సంక్షేమం కోసం వివిధ సామాజిక భద్రతా పథకాలను మరింత మెరుగ్గా అమలు చేయడానికి ఉపకరిస్తుంది.

ప్రమాధ భీమా రూ.2 లక్షలు

“భారతదేశ చరిత్రలో మొట్ట మొదటిసారిగా 38 కోట్ల మంది అసంఘటిత కార్మికుల వివరాలను నమోదు చేయడానికి ఒక వ్యవస్థ తయారు చేస్తున్నాము. ఇందులో వివరాలు నమోదు చేయడం ద్వారా కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సామాజిక భద్రతా పథకాలను పొందడానికి మీకు సహాయంగా ఉంటుంది” అని కార్మిక మంత్రి అన్నారు. అలాగే, ఇందులో తమ పేర్లు నమోదు చేసుకున్న అసంఘటిత కార్మికులకు రూ.2.0 లక్షల ప్రమాధ భీమా అందించినందుకు ప్రధాన మంత్రికి శ్రీ భూపేందర్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ఒక వ్యక్తి ప్రమాదానికి లోనై మరణిస్తే/శాశ్వత వైకల్యం చెందితే రూ.2.0 లక్షలు, పాక్షిక వైకల్యం చెందితే రూ.1.0 లక్షలకు అందించనున్నట్లు తెలిపారు.

అసంఘటిత రంగ కార్మికులు తమ పేర్లను పోర్టల్‌లో పుట్టిన తేదీ, స్వస్థలం, మొబైల్ నంబర్ వంటి వివరాలను నమోదు చేసుకోవాలి. అలాగే, కార్మికుడు తన ఆధార్ కార్డ్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేయాలి. పూర్తి వివరాలు నమోదు చేశాక కార్మికునికి ఈ-శ్రమ్ కార్డు ఒకటి మీకు వస్తుంది. దాన్ని భద్రపర్చుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏవైనా సందేహాలుంటే టోల్ ఫ్రీ నంబర్ 14434కి కాల్ చేయవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here