ఫ్రాన్స్కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ నుంచి భారత్ 36 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు చేసిన వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందన్న అంశం మళ్లీ తెరమీదకొచ్చింది. యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ఫ్రాన్స్లో తాజాగా న్యాయ విచారణ మొదలైనట్లు ఫ్రాన్స్ కు చెందిన పరిశోధక వెబ్సైట్ ‘మీడియా పార్ట్’ వెల్లడించింది. ఈ విచారణకు నేతృత్వం వహించడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక న్యాయమూర్తిని కూడా నియమించినట్లు ఆ వెబ్సైట్ పేర్కొంది.
సుమారు రూ.59 వేల కోట్ల విలువైన ఈ ఫైటర్ జెట్ల కొనుగోలు ఒప్పందంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగినట్లు, కమీషన్ల రూపంలో కోట్లాది రూపాయల సొమ్ము చేతులు మారినట్లు ఆరోపణలు రావడం తెల్సిందే. దసాల్ట్ ఏవియేషన్ కంపెనీ తయారు చేసిన 36 రఫేల్ ఫైటర్ జెట్లను ఇండియాకు విక్రయించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం గతంలో ఓకే చెప్పింది. ఇందుకు సంబంధించి ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య 2016 సెప్టెంబర్లో ఒప్పందం కూడా కుదిరింది. ఇప్పటికే కొన్ని ఫైటర్ జెట్లను దసాల్ట్ సంస్థ తయారుచేసి భారత్కు పంపించిన విషయం కూడా తెలుసు.
ఈ ఒప్పందంలో అవినీతి ఆరోపణలు రావడంతో ఇరుదేశాల్లోనూ రాజకీయ ప్రకంపనలు రేపాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి వివాదాస్పద రఫేల్ డీల్పై ఫ్రాన్స్లో ‘నేషనల్ ఫైనాన్షియల్ ప్రాసిక్యూటర్ ఆఫీస్(పీఎన్ఎఫ్)’ ఆదేశాల మేరకు గత నెల 14న న్యాయ విచారణ అధికారికంగా ప్రారంభమైనట్లు ఈ మీడియా పార్ట్ పేర్కొంది. అత్యంత భారీ ఆర్థిక, వాణిజ్య నేరాల విచారణ కోసం ఫ్రాన్స్ ప్రభుత్వం.. పీఎన్ఎఫ్ను 2013 ఏడాదిలో ఏర్పాటుచేసింది.
Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్బుక్(Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.