కరోనా సంక్షోభంతో ఆదాయం పడిపోయిన టెలివిజన్‌ రంగానికి క్రీడా రంగం ఊపిరి పోస్తున్నాయి. ఒకప్పుడు టీవీ యాడ్‌ రెవెన్యూలో 10 శాతంగా ఉన్న స్పోర్ట్స్‌ వాటా ఇటీవల 20 శాతానికి చేరుకుంది అని నివేదికలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా క్రికెట్‌ టీమ్ విజయాలు సాధిస్తుంటే దానికి తగ్గట్టుగా టీవీలలో కూడా యాడ్‌ రెవిన్యూ బౌండరీలు దాటేస్తోంది. అన్నీ వ్యాపారాలతో పాటుగా అడ్వెర్‌టైజ్‌ రంగం మీద కూడా కరోనా ప్రభావం భారీగానే పడింది. దీంతో యాడ్‌ రెవెన్యూ ఆధారంగా నడిచే టెలివిజన్‌ రంగానికి పెద్ద సమస్యే వచ్చి పడింది.

అయితే, ఇలాంటి క్లిష్ట సమయంలో ఆస్ట్రేలియా టూర్‌లో టీమిండియా సంచలనం విజయమ సాధించడం.. ఆ వెంటనే ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభం కాకవడంతో ఒక్కసారిగా యాడ్‌ రెవెన్యూ కూడా పట్టాలెక్కింది. మధ్యలో కరోనా కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చిన టోక్యో ఒలింపిక్స్‌ మీడియా రంగాన్ని ఆదుకున్నాయి. కరోనా రాక ముందు టీవీ యాడ్‌ రెవెన్యూలో స్పోర్ట్స్‌ వాటా 10 నుంచి 15 శాతం వరకు మాత్రమే ఉండేది. అయితే కరోనా ఫస్ట్‌ వేవ్‌ ముగిసిన తర్వాత ఐపీఎల్‌ ప్రారంభంతో ఒక్కసారిగా యాడ్‌ రెవెన్యూ వాటా 20 శాతానికి పెరిగినట్లు ఇంటిగ్రేటెడ్‌ మీడియా ఆఫ్‌ అడ్వెర్‌టైజింగ్‌ కంపెనీ డీడీబీ గ్రూప్‌ ఎండీ రామ్‌ మోహన్‌ సుందరమ్‌ తెలిపారు.

పది సెకన్ల యాడ్‌కి ఇంతనా..

ప్రపంచకప్‌, టోక్యో ఒలింపిక్స్‌లను మించిన డిమాండ్‌ టీవీలలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌కి ఉంది. ఇటీవల మధ్యలో ఆగిపోయిన సీజన్‌ 14కి సంబంధించి కేవలం పది సెకన్ల యాడ్‌కి రూ.14 లక్షల వంతున ఛార్జ్‌ చేశాయి టీవీ సంస్థలు. అంటే ఒక్క సెకనుకి లక్షకు పైగానే ధర పలికింది . అయినా సరే కార్పొరేట్‌ కంపెనీలు వెనక్కి తగ్గడం లేదు. టీవీలు అడిగినంత సొమ్ము చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకుంటున్నాయి. ఇండియన్‌​ టెలివిజన్‌ యాడ్‌ రెవిన్యూలో ఇప్పటికీ అగ్రస్థానం పలు సీరియల్లే ఆక్రమించాయి. ఆ తర్వాత సినిమాలు, న్యూస్‌, స్పోర్ట్స్‌, మ్యూజిక్‌, కిడ్స్‌ విభాగాలు ఉండేవి. క్రమ క్రమంగా సినిమాలను స్పోర్ట్స్‌ వెనక్కి నెట్టేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here