Saturday, April 20, 2024
HomeBusinessDeals & Offersహీరో ఎలక్ట్రిక్ సంచలనం: సింగిల్ చార్జ్ తో 200 కి.మీ ప్రయాణం

హీరో ఎలక్ట్రిక్ సంచలనం: సింగిల్ చార్జ్ తో 200 కి.మీ ప్రయాణం

ప్రముఖ బైక్ తయారీ సంస్థ హీరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఈ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు నిక్స్ హెచ్ ఎక్స్. దీని ప్రారంభ ధర రూ.64,640. దీని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్లు వెళ్లగలదు. ఇందులో ఆప్టిమా HX, నిక్స్ HX, ఫోటాన్ HX అనే మూడు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది చూడటానికి అన్నిటికంటే పొడవుగా చాలా భిన్నంగా ఉంది. సామాన్యులు, గ్రామీణ ప్రజలకు తగ్గట్టుగా దీనిని తయారు చేశారు. స్పీడ్, రేంజ్ బట్టి స్కూటర్ ఎంచుకునే అవకాశం ఉంది.(ఇది చదవండి: ఓలా సంచలనం: సింగిల్ చార్జ్ తో 240 కి.మీ ప్రయాణం)

ఈ స్కూటర్లలో మోడల్‌ని బట్టీ ఒకసారి చార్జ్ చేస్తే 82 కిలోమీటర్ల నుంచి 210 కిలోమీటర్ల దాకా వెళ్తాయి. ఇందులో ప్రారంభ మోడల్ 82 కిలోమీటర్లు వెళ్తుంది. టాప్ మోడల్ 210 కిలోమీటర్లు వెళ్లనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్లలో నిక్స్ హెచ్ ఎక్స్ హై స్పీడ్ గంటకు 42 కిలోమీటర్లు. అంటే ఇది సిటీలో ప్రయాణించేవారికి బాగా ఉపయోగపడుతుంది. దీనిలో డిజిటల్ స్పీడోమీటర్ ఉంది. వెనక రైడర్‌కి మూడు గ్రాబ్ రెయిల్స్ ఉన్నాయి. ఓ బాటిల్ హోల్డర్ ఉంది. దీనికి 1.536 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్లపై హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఎంపిక చేసిన మోడళ్లపై పలు ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తుంది. ఎవరైనా హీరో బైక్ లేదా స్కూటర్‌ను ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో పొందాలనుకుంటే డౌన్ పేమెంట్ రూ.4999 ఉంది. వడ్డీ రేటు రూ.6.99గా నిర్ణయించింది కంపెనీ.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles