ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది. యూజర్లకు ఎయిర్ పాడ్స్ను ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ ఎయిర్ పాడ్స్ను ఉచితంగా పొందాలంటే యాపిల్ పెట్టిన కొన్ని నిబంధనల్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. యాపిల్ సంస్థ మార్చి 7,2022 వరకు ‘బ్యాక్ టూ యూనివర్సిటీ’ ప్రోగ్రామ్ను నిర్వహిస్తుంది. ఈ ప్రోగ్రామ్లో భాగంగా విద్యార్ధులు, టీచర్లకు ఎయిర్ పాడ్స్ను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం యూజర్లు మాక్, ఐపాడ్ను కొనుగోలు చేయాల్సి ఉంటుందనే షరతు విధించింది.
ఈ ఆఫర్ యాపిల్ ప్రొడక్ట్ లైన మాక్బుక్ ఎయిర్, మాక్ బుక్ ప్రో, ఐమాక్, మాక్ మిని, ఐమాక్ ప్రో, ఐపాడ్ ప్రో, ఐ పాడ్ ఎయిర్ను కొనుగోలు చేస్తే యాపిల్కు చెందిన సెకండ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ను ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. అదే ఎయిర్ పాడ్స్ను ఉచితంగా పొందిన యూజర్లు థర్డ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్, ఎయిర్ పాడ్స్ ప్రోకి కూడా అప్గ్రేడ్ అవ్వొచ్చని తెలిపింది. కాకపోతే న్యూజనరేషన్ ఆడియో ప్రొడక్ట్లకు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ఆఫర్ ఏఏ దేశాల్లో ఉందంటే?
ప్రస్తుతం మాక్, ఐపాడ్ కొన్న యూజర్లకు యాపిల్ అందిస్తున్న ఈ ఫ్రీ ఆఫర్ ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, బ్రెజిల్, సౌత్ కొరియాతో పాటు భారత్లో సైతం అందుబాటులో ఉంది. కానీ యాపిల్ అఫీషియల్ సైట్లో మాత్రం “సేవ్ ఆన్ ఏ న్యూ మాక్ ఆర్ ఐపాడ్ విత్ యాపిల్ ఎడ్యుకేషన్ ప్రైసింగ్” అని చూపిస్తుంది. కాబట్టి డిస్కౌంట్ను పొందవచ్చు. అదనంగా యాపిల్ ‘యాపిల్ కేర్ ప్లస్’ ప్రొటెక్షన్ ప్లాన్లపై 20 శాతం డిస్కౌంట్ను అందిస్తుంది. యూజర్లు ముందుగా ఈ ఆఫర్ పొందేందుకు మాక్, ఐపాడ్ ఉత్పత్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఉచితంగా పొందే ఎయిర్ పాడ్స్ అప్డేట్ అవుతాయి.