ఆన్లైన్లో ఫ్లాష్ సేల్స్తో ఈ-కామర్స్ కంపెనీల చేస్తున్న హడావిడి అంతా ఇంత కాదు. పండుగ సమయంలో భారీ డిస్కౌంట్తో అతి తక్కువ ధరకు ఫలాన ఉత్పత్తిని, ఫలానా సమయానికి అమ్ముతామంటూ చేసే ఆర్భాటాలకు మరి కొద్ది రోజుల్లో అడ్డుకట్ట పడనుంది. ఒక వస్తువును చూపించి మరో వస్తువును అంటగట్టినా, ఉత్పాదనను, సేవను అందించడంలో విక్రేతలు విఫలమైనా ఆ బాధ్యత ఈ-కామర్స్ కంపెనీలదే. ఈ మేరకు వినియోగదారులకు మరిన్ని రక్షణ(ఈ-కామర్స్)లు కల్పించేలా నిబంధనలకు సవరణలు చేయాలని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంసీఏ) సూచించింది.
ప్రభుత్వం చేయబోయే సవరణలపై తమ అభిప్రాయాలు, సూచనలను తెలియజేసేందుకు ఈ-కామర్స్ కంపెనీలకు, పారిశ్రామిక సంఘాలకు వచ్చే నెల జూలై 6 వరకు ఎంసీఏ సమయం ఇచ్చింది. మార్కెట్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, కొందరు విక్రేతలకే ప్రాధాన్యత కల్పిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఫ్లిప్కార్ట్, అమెజాన్ తదితర ఈ-కామర్స్ కంపెనీలపై కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) విచారణ జరుపుతున్న తరుణంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకోవడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆఫ్లైన్ విక్రేతలను దెబ్బతీసేలా ఆఫర్ చేస్తున్న భారీ డిస్కౌంట్లపైనా కూడా సీసీఐ దర్యాప్తు చేస్తోంది. కొత్త నిబంధనలు అమలులోకి వస్తే ఈ-కామర్స్ కంపెనీల్లో జవాబుదారీతనం మరింత పెరుగుతుంది. వినియోగదారుల ప్రయోజనాలే లక్ష్యంగా దేశంలో ఈ-కామర్స్ రంగంలో కఠిన నిబంధనలు రానున్నాయి.
అధికారుల నియామకం
కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ-కామర్స్ కంపెనీలు అవసరమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలి. చీఫ్ కాంప్లియాన్స్ ఆఫీసర్ను నియమించాలి. భారతీయ పౌరుడైన ఈ-కామర్స్ ఉద్యోగిని రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్గా నియమించాలి. చట్టాన్ని అమలు చేసే సంస్థల సంప్రదింపుల కోసం ఈ అధికారి అందుబాటులో ఉండాలి. ప్రతి ఈ-కామర్స్ సంస్థ వీలైనంత త్వరగా లేదా ఆర్డర్ అందిన 72 గంటల్లోగా సమాచారాన్ని ప్రభుత్వ సంస్థలకు అందించాలి. ప్రైవేట్ లేబుల్స్ అమ్మకాలకు, ప్రమోషన్కు ఈ-కామర్స్ కంపెనీ తన బ్రాండ్లను వినియోగించరాదు.
Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్బుక్(Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.