ఏప్రిల్ 1 నుంచి బంగారం ధరలు రోజు రోజుకి దేశీయ, అంతర్జాతీయంగా భారీగా పెరగిపోతున్నాయి. మార్చి 31న రూ.44,917 ఉన్న 24 క్యారెట్ల స్వచ్ఛ బంగారం ధర ఏప్రిల్ 11 వచ్చేసరికి రూ.46,554కు చేరుకుంది. అంతర్జాతీయంగా, దేశీయంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్న కారణంగా పెళ్లిళ్ల సీజన్ కాబట్టి బంగారం కొనుగోలు చేయాలా వద్దా అనే దాని గురుంచి ప్రజానీకం ఆలోచిస్తున్నారు. ఒకవైపు ద్రవ్యోల్భణం పెరగడం, కరోనా కేసులు తిరిగి ఎక్కువ పుంజుకోవడం వంటి అంశాలు బంగారం పెరుగుదలకు కారణం కావచ్చు అని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Source: IBJA

మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.49,000ను దాటే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి సమీప భవిష్యత్తులో బంగారం కొనుగోలు చేయాలని భావించేవారు ఇప్పుడే తీసుకోవడం మంచిది. అంతర్జాతీయంగా కూడా గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్ల నుంచి 1820 డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉండవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేల కరోనా కారణంగా లాక్ డౌన్ విదిస్తే కనుక ఆ ప్రభావం బిజినెస్ మీద పడి స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగే అవకాశం ఉంది. దింతో చాలా మంది పెట్టుబడుదారులు స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకొని బంగారం మీద స్వల్పకాలానికి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఈ కారణం చేత బంగారం ధరలు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here