Andhra Pradesh: మీకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉందా? అయితే, మీకు హెచ్చరిక. ఈ-కేవైసీ చేయించుకున్న వారికి మాత్రమే రేషన్ కార్డుదారులకు మాత్రమే అక్టోబరు నెల నుంచి రేషన్ ఇస్తారు. ఈ-కేవైసీ నమోదు చేయించుకోకపోతే రేషన్ ఇవ్వరు. అయితే, ఈ-కేవైసీ నుంచి 5 – 15 ఏళ్ల లోపు వారికి మాత్రం నెలాఖరు వరకు గడువు పొడిగింపు ఇచ్చినట్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్ కోన శశిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ-కేవైసీ లేని వారికి రేషన్ నిలిపేసిన.. నమోదు చేయించుకుని వస్తే తర్వాత వెంటనే ఇస్తామన్నారు.(చదవండి: TSRTC: ఉద్యోగులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్!)
కేంద్రం ఆదేశాల మేరకు బియ్యం కార్డులోని ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలి. ఐదేళ్లలోపు వారికి అవసరం లేదు. వాలంటీర్ దగ్గరుండే మొబైల్ యావ్ ద్వారా నిర్ధారణ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఒక కార్డులో నలుగురుంటే.. ముగ్గరికి ఈ-కేవైసీ అయి ఉంటే వారికి మాత్రమే రేషన్ ఇస్తారు. ఈ-కేవైసీ పూర్తి చేయించుకున్నాకే నాలుగో సభ్యుడికి ఇదే నెలలో రేషన్ ఇస్తారు. ఒకేవేళ వేలిముద్రలు సరిగా పడని కూలి పనులు చేసేవారు, వృద్ధులకు.. చౌక దుకాణంలోని ఈ-పోస్ యంత్రంలో ప్యూజన్ ఫింగర్ అవకాశాన్ని వినియోగించుకుని ఈ-కేవైసీ నమోదు చేయించుకోవచ్చు. కుష్టవ్యాధి వారికి వీఆర్ఓ ద్వారా, ఒంటరి కార్డు దారులకు వాలంటీర్ ద్వారా గతంలో లాగే రేషన్ తీసుకోవచ్చు.