Friday, April 26, 2024
HomeGovernmentNew Ration Cards: రేపటి నుంచే కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ

New Ration Cards: రేపటి నుంచే కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ

అర్హులైన పేదలకు రేషన్‌ కార్డులు జారీ చేసే ప్రక్రియ సోమవారం(జూలై 26) నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది. 3.09 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డులను అందజేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాలకు పౌర సరఫరాల శాఖ సమాచారం చెరవేసింది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు జూలై 26 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. కొత్తగా జారీ చేసిన రేషన్‌ కార్డు లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్‌ బియ్యం అందజేయనున్నారు.

నిజానికి గడిచిన నెలలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయాలని నిర్ణయించిన సమయంలో గతంలోనే కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల సంఖ్య 4,46,169గా ఉండగా, వీటిని అన్ని దశల్లో పరిశీలించారు. అన్నీ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడి 3,09,083 మందిని అర్హులుగా నిర్ణయించారు. కొత్త కార్డుల జారీలో అధికంగా హైదరాబాద్‌లో 56,064 మందిని అర్హులుగా తేల్చగా, రంగారెడ్డిలో 35,488 మందిని, మేడ్చల్‌లో 30,055 మందిని అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles