Monday, April 29, 2024
HomeGovernmentTelanganaRation Card e-KYC: తెలంగాణలో రేషన్ కార్డు ఈ-కేవైసీ గడువు పొడిగింపు

Ration Card e-KYC: తెలంగాణలో రేషన్ కార్డు ఈ-కేవైసీ గడువు పొడిగింపు

Ration Card e-KYC: రాష్ట్రంలోని రేషన్‌ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం కీలక సూచన చేసింది. రేషన్‌ కార్డు ఈ-కేవైసీ పూర్తి చేయని ప్రజలు త్వరగా ఈ-కేవైసీ చేయాలని కోరింది. ఈ-కేవైసీ గడువు తేదీని 2024 జనవరి 31 వరకు పొడగించినట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ దేవేంద్రసింగ్‌ చౌహాన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఏడాది జనవరి 31లోగా ఈ-కేవైసీని పూర్తి చేయాలని అన్ని రేషన్‌ షాపుల నిర్వాహకులను కమిషనర్ ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ కార్డు(ఫుడ్‌ సెక్యూరిటీ కార్డు) ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 70.80శాతం ఈ కేవైసీ పూర్తి అయిందని పౌరసరఫరాలశాఖ తెలపింది. మిగతా వాళ్లకు కూడా ఈ కేవైసీ పూర్తి చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

(ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీ పథకాల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా..?)

ఈ నేపథ్యంలో రేషన్ షాప్ దగ్గర రద్దీ భారీగా పెరిగింది. ప్రజాపాలన కార్యక్రమం కింద కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీల పథకాల కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మరోవైపు రేషన్‌ కార్డు ఈ-కేవైసీ ప్రక్రియకు గడువు తేదీ కూడా తక్కువగా ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles