Wednesday, May 8, 2024
HomeHow Toపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. అకౌంట్లలోకి పీఎఫ్ వడ్డీ జమ.. బ్యాలెన్స్ చెక్​ చేసుకోండిలా!

పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. అకౌంట్లలోకి పీఎఫ్ వడ్డీ జమ.. బ్యాలెన్స్ చెక్​ చేసుకోండిలా!

EPFO Interest 2022-23: దీపావళి సందర్భంగా ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పీఎఫ్‌ వడ్డీ(PF Interest)ని దశల వారీగా ఖాతాదారుల అకౌంట్లలో జమచేస్తోంది. కొందరి ఖాతాల్లో ఇప్పటికే వడ్డీ సొమ్ము జమ అయితే.. ఇంకా.. పలువురి ఖాతాల్లో జమ కావాల్సి ఉంది.

మీ పీఎఫ్​ బ్యాలెన్స్​ను ఈపీఎఫ్​ఓ(EPFO) అధికారిక ఫోర్టల్ ద్వారా, ఉమంగ్ యాప్ ద్వారా, టెక్ట్స్ మెసేజ్.. మిస్డ్ కాల్​ అలర్ట్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌: మీ పీఎఫ్ ఖాతాలో ఈపీఎఫ్ వడ్డీ జమ అయ్యిందో లేదో పోర్టల్ ద్వారా తెలుసుకోవడానికి.. ముందు మీరు ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌(https://passbook.epfindia.gov.in/MemberPassBook/login)లో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మీరు పనిచేస్తున్న సంస్థ నెంబర్ ఎంచుకొని బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

ఉమాంగ్‌ యాప్‌ ద్వారా: ముందు మీ మొబైల్​లో ఉమాంగ్‌ యాప్‌(Umang App) డౌన్​లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత యాప్​ ఓపెన్​ చేసి అందులో ఈపీఎఫ్‌ సెక్షన్‌లోకి వెళ్లి.. వ్యూ పాస్‌బుక్ ఆప్షన్‌ ఎంచుకోవాలి. అనంతరం UAN నంబర్‌ ఎంటర్‌ చేసి గెట్‌ ఓటీపీ ఆప్షన్‌ ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. అప్పుడు ఈపీఎఫ్‌ ఖాతా వివరాలు కనిపిస్తాయి.

మెసేజ్ ద్వారా: పీఎఫ్ ఖాతాలో ఈపీఎఫ్ వడ్డీ జమ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి మీ రిజిస్టర్​ మొబైల్ నంబర్ నుంచి EPFOHO అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి UAN నంబర్ ఎంటర్ చేసి.. ENG లేదా TEL లేదా HIN ఇలా లాంగ్వేజ్ ఏదైతే అది నమోదు చేసి..7738299899 నంబర్​కు మెసేజ్ పంపాలి. మీ పీఎఫ్ బ్యాలెన్స్​ను మెసేజ్ రూపంలో పొందుతారు.

- Advertisement -

మిస్డ్ కాల్ ద్వారా: UANతో రిజిస్టర్ అయిన మీ మొబైల్ నంబర్‌ నుంచి 011-22901406 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చిన తర్వాత ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా పీఎఫ్ ఖాతాలో ఎంత ఉందనే మెసేజ్ వస్తుంది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles